అత్యాధునిక హంగులతో కొత్త బస్సులు.. ప్రారంభం
హైదరాబాద్ 24 డిసెంబర్ 22
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
శనివారం ప్రారంభించారు. ఈ బస్సులలో ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలను, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ లతో కలిసి సూపర్ లగ్జరీ బస్సుల ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాష్ తో పాటు ఉన్నతాధికారు పాల్గొన్నారు.