41.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణవిద్యార్థులకు అల్పాహారం అందజేత

విద్యార్థులకు అల్పాహారం అందజేత

విద్యార్థులకు అల్పాహారం అందజేత

కామారెడ్డి యదార్థవాది ప్రతినిథి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో 11 హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉదయం, సాయంత్రం 50 రోజులపాటు అల్పాహారం అందిస్తున్న దాత లోయపల్లి నర్సింగరావు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడారు విద్యార్థులు పరీక్ష విషయంలో ఎలాంటి భయాందోళన చెందకుండా ఏకాగ్రతతో ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని మండలంలోని ప్రతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మొదటి స్థానం ఉత్తీర్ణత ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు పరీక్ష విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు ఉపాద్యాయులు ప్రోత్సహించాలని,వాళ్ళ విషయంలో ఎలాంటి అవసరం ఉన్న ముందు ఉంటానని ఉపాద్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు ఆల్ఫాహారం కార్యక్రమం ఏర్పాటు చేసి లోయపల్లి నర్సింగరావు గారికి డిఈఓ రాజు,ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు,ఎస్సి ఎస్టీ ఉపాద్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, జడ్పీటీసీ మిణుకురి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ జిడిపల్లి నర్సింహారెడ్డి,మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు మిద్దెల రాజు,పలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఉపాద్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్