అథ్లెటిక్స్ టీం కోచ్ గా మధుసూదన్
యదార్థవాది ప్రతినిధి మెదక్
మధ్యప్రదేశ్ లోని భూపాల్ స్టేడియంలో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు రెండు రోజు పాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే టీం కు కోచ్ గా అథ్లెటిక్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో జరిగే ఖేల్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటే విధంగా కృషి చేస్తామన్నారు.