ఇసుక రవాణాను నిలిపివేయాలి
-అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
నిజామాబాద్ యదార్థవాది
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖండ్గాం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా గురించి ఏదైతే పర్మిషన్ లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అధిక మొత్తంలో టిప్పర్ లోడింగ్ మా గ్రామం నుంచి వెళ్లడం జరుగుతుందని, 12 టైర్ల లారీలు అంబేద్కర్ విగ్రహం నుండి వెళ్లడం వలన విగ్రహం వునికికే ప్రమాదమని దీనిపై మండల తహసిల్దార్, ఆర్డీవో కి వినతిపత్రం ఇచ్చినప్పటికీ నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి కే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులు ఉండి కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇటువైపు దృష్టి పెట్టకుండా ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా జరగనివ్వకుండా కట్టడి చేస్తారని కోరుతున్నాం ఇంతటితో ఆపకపోతే ఎందాకైనా పోతామని మంజీరా నుండి అక్రమ ఇసుక రవాణా జరగనివ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి అధిక మొత్తంలో టిప్పర్లు వెళ్లడం వలన అంబేద్కర్ విగ్రహానికి డ్యామేజ్ కావడం జరిగింది. దీనిపై కూడా దృష్టి వహించి దీనిపై ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఖండ్గాం గ్రామ యువకులు మీసాలే నాగేష్, అశోక్, నరసింహ, దిక్శాంత్, పిరాజి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు..