నీట్ 2021 ఫలితాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన రుషీల్ నీట్లో ఐదో ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకుతో సత్తా చాటారు.
మెడికల్ డెంటల్ ఆయుష్ విభాగాలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నిర్వహించిన దేశవ్యాప్త పరీక్షల ఫలితాలను వెల్లడించారు. సుమారు 16 లక్షల మంది నీట్ రాశారు.