ఎన్నికలలో భాగంగా ముమ్మర తనిఖీలు చేస్తాం: సబ్ ఇన్స్పెక్టర్.
మానకొండూర్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికల తనిఖీలలో బాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకీ క్రాస్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన వాహానాల తనిఖీలో కారులో రూ. 28 లక్షల 50 వేలు నగతుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి. మానకొండూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా పెద్ద మొత్తంలో అవసరమైన రూపాయలు తీసుకొని వెళ్లే క్రమంలో అట్టి రూపాయలకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉంచుకొని ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలలో వాటి రసీదులు చూపెట్టలని, సరైన పత్రాలు ఉన్నచో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ చూపించి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.