25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణకరువుకు వీడ్కోలు.. చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు

కరువుకు వీడ్కోలు.. చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు

కరువుకు వీడ్కోలు..చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

కరువు కు వీడ్కోలు పలికి చెరువులను జలసిరులతో నింపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎనలేని విధంగా పాటుపడిందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినా కేసులు వేయించిన ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందని హుస్నాబాద్ కరువును శాశ్వతంగా పార ద్రోలిందని త్వరలో సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును హుస్నాబాద్ నియోజకవర్గానికి అంకితం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నియోజవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 103 కోట్ల కల్యాణ లక్ష్మి, 695 కోట్ల ఆసరా పెన్షన్స్ 810 కోట్ల రైతుబంధు, 60 కోట్ల రైతు బీమా అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ లబ్ధిదారులకు.. కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు 15 కోట్ల రూపాయలు విలువగల చెక్కులు పంపిణీ చేశారు, ‌ రెండవ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు, గౌరవెల్లి ముంపు ఎస్టి బాధితులు 185 మందికి 8 లక్షల చొప్పున 14 కోట్ల 80 లక్షల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్