జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి
యదార్థవాది బ్యూరో
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-AIFB పార్టీ 19వ జాతీయ మహాసభల ను హైదరాబాద్ నగరంలోని సుందరయ్య కళా నిలయంలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న సందర్బంగా జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను చేర్యాల మండల పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా బృందం ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేతాజీ శుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1940 జూన్ 18 నుండి 22 వరకు నాగపూర్ లో జాతీయ మహాసభలు నిర్వహించి భారత ప్రజలకే సర్వధికారాలు అనే నినాదంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ను రాజకీయ పార్టీగా ప్రకటించారని అన్నారు.ఈ జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టడంలో ఈ మహాసభలు ఉపయోగపడతాయాని అన్నారు.ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేర్యాల మండల పట్టణ కార్యదర్శి ఒగ్గు తిరుపతి,జిల్లా నాయకులు ఆత్మకూరి హరికృష్ణ,నంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు