జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.
-అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరీలు. ఆట కట్టిస్తున్న పోలీసులు..
-జగిత్యాల పట్టణంలో 8ద్విచక్ర వాహనాలు, ఒక కారును సీజ్ చేసిన పోలీసులు..
జగిత్యాల యదార్థవాది ప్రతినిది
అర్ధరాత్రి ప్రధాన కూడళ్లలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకొన్న జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నటేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారే లక్ష్యంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ పేరుతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించామని, రాత్రివేళల్లో జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూన్న, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్ తో, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా ఉన్న 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని 8ద్విచక్ర వాహనాలు, 1 కారును సీజ్ చేశాం అన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని అర్ధరాత్రి ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి మరి ముఖ్యంగా మహిళల ను ఇబ్బందుల కు, అభద్రత భావానికి గురి చేస్తే టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారని ఇప్పటికైనా మంచి మార్గాల్లో నడవాలని యువతకు సూచించారు.
