23.8 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణతెగని భూమి పంచాయితీలు

తెగని భూమి పంచాయితీలు

సిద్దిపేట జిల్లాలో తెగని భూ పంచాయతీలు,తీవ్ర ఇబ్బందుల్లో బాధితులు
యధార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక బక్క చిక్కిన నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఎక్కలదేవి లింగం తన భూమి తనకు ఇప్పించాలంటూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. భాదితుడు ఎక్కలదేవి లింగం తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అర్బన్ ప్రాంతంలోని స్థానిక ఎల్లమ్మ గుడి నుండి నాగదేవత గుడికి వెళ్ళే మార్గంలో సర్వే నెంబర్ 185/అ లో ఒక ఎకరం ఇరవై గుంటల భూమి తనకు తన వంశపారంపర్యంగా వస్తుందని అటువంటి భూమిపై కొందరు గద్దల వలే వాలి తన భూమిని తన్నుకు పోదామని చూస్తున్నారని న్యాయపోరాటం చేస్తూ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి మంగళవారం మంత్రి హరీష్ రావును క్యాంపు కార్యాలయంలో కలిసి తన మొర విన్నవించుకున్న సమయంలో మంత్రి హరీష్ రావు స్థానిక ప్రజాప్రతినిధిని పిలిచి నకిలీ పత్రాలు సృష్టిస్తూ దౌర్జన్యంగా ఎక్కలదేవి లింగం భూమిలో కబ్జాలకు పాల్పడుతున్న ఐలయ్య వారి కుటుంబ సభ్యులను పిలిచి విచారించి లింగం భూ పంచాయతీ సంగతి ఏంటో చూడు సమస్యతో పిల్లగాడు మళ్ళీ కనిపించవద్దు అని చెప్పినట్టు లింగం తెలిపారు.ఇక లింగం కల ఎప్పుడు నెరవేరుతుందో తనభూమి తన హద్దులోకి తన చేతుల్లోకి అధికారికంగా ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్