తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగా..మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట 25 డిసెంబరు 22
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరుపు కుంటున్నమని రాష్ట్ర ఆర్థిక, అరిగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పెదవర్గాలే బీఆర్ఎస్ప్ర పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే తెలంగాణ ప్రభుత్వదేయమని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని, ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి హాజరయ్యారు. కేక్ కట్ క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో క్రిస్మస్ పండుగకు రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని,పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మబంధువులని అన్నరు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతున్నరు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2022/12/5-11-1024x666.jpg)