తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యం
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గృహంలో బుదవారం భారతీయ జనతా పార్టీ పట్టణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈ నెల10 తేదీ నుండి 25 వ తారీకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శక్తి కేంద్ర పరిధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడానికి పిలుపునిచ్చిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి శక్తి కేంద్ర పరిధిలో స్ట్రీట్ మీటింగ్ ప్రణాళికను రూపొందించుకొని, కార్యక్రమ విజయవంతనికై ప్రతి కార్యకర్త ప్రధానంగా శక్తి కేంద్ర ఇంచార్జులే పూర్తి బాధ్యతని తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, భూసం ప్రతాప్, కార్యదర్శి ఖాంధేశ్ ప్రశాంత్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.