నిరుద్యోగ యువత కోసం పోరాడుదాం
నిజామాబాద్ యదార్థవాది
సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి పేద బడుగు బలహీన వర్గాలు మహిళల సముద్ధరణకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.. అనంతరం పులే విగ్రహం వద్ద టీ-సేవ్ లోగోను ఆవిష్కరించిన బుస్సాపుర్ శంకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి అని నిరుద్యోగుల విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడుదాం అని తొమ్మిదేండ్లుగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం పై ప్రభుత్వ మోసాలపై గళం వినిపించుదాం పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకొద్దాంఅని శంకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా యువజన అద్యక్షులు అంకార్ గణేష్,సంతోష్, సాగర్,మహిళ నేతలు రేఖ, రాణి తదితరులు పాల్గొన్నారు.