పల్లెలు అభివృద్ధి వైపు అడుగు వేయాలి: పోలీస్ కమిషనర్
* యువత చదువులో ముందుండాలి..
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మంచిర్యాల జోన్ సబ్ డివిజన్ పరిధి జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లి నగర్ గ్రామంలో శుక్రవారం పోలీస్ ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు చీరలు యువకులకు వాలీ బాల్ కిట్స్ అందచేసిన రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మారు మూల గ్రామలైన అల్లి నగర్ దొంగపల్లి మల్యాల బొమ్మేనా పైడి పల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ తరుపున ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ మీకోసం కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది పల్లెలు దేశానికి పట్టుకోమ్మలని విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని పిల్లలకు చదువు ఏంటో నేర్పిస్తుందని యువతీ యువకులు చదువుకొవడానికి కేజీ నిండి పి జి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ ప్రాంతం లోని పిల్లలు పెద్ద స్థాయిలో ఎదగాలి ఉద్యోగంతో మన పల్లె యువతీ యువకులు ఉండాలని ఉద్యోగ పరంగా వాళ్ళకి కాంపిటీవ్ ఎగ్జామినేషన్ చదువుకు అవసరం ఉన్నటు వంటి సహాయం కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించడం కోచింగ్ మెటీరియల్ ఇప్పివడం జరుగుతుందని పోలీస్ తరుపున మీకేం కావాలో తెలియచేయాలని డిపార్ట్మెంట్ తరఫున అందిస్తానని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున చాలా పథకాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యకమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి జన్నారం ఎస్సై సతీష్ సర్పంచ్ ఎంపిపి గ్రామ పటేల్ ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.