పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు కొత్త నిబంధన.!
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కు చెక్ పెట్టిన ఎన్నికల సంఘం..
ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలతో ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు తీసుకుంది.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది ఇకపై తాము ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్ లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఈఎన్నికలలో కల్పించింది.
పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకునే ఉద్యోగులు ఒక శక్తిగా ఎదుగుతున్నారని, తమ ఓటును దుర్వినియోగం చేయడమేనని, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకొని తమ ప్రయోజనాల కోసం బేరా సరాలు చేస్తే అది మంచి పద్ధతి కాదని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు..