24.8 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి

ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి

ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలోని స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో శనివారం ఆర్మూర్ డివిజన్ ఏజెంట్లతో బ్రాంచ్ మేనేజర్ వేంపల్లి మహేష్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ క్లస్టర్ టీం లీడర్ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై పలు సలహాలు సూచనలు చేశారు. 2022 -23 వ సంవత్సరంలో అత్యధిక పాలసీలు చేయించి సంస్థకు పాలసీదారులకు ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ప్రధానం చేశారు. అనంతరం ఉత్తమ ఏజెంట్లను శాలువ, మెడల్స్ తో సత్కరించారు. ఏజెంట్లు అందరూ తమ తమ టార్గెట్లను అధిగమించి ఆర్మూర్ బ్రాంచ్ ను ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. సంస్థ అధినేత సీఎం డి జగనాదం కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్లు రాకేష్ గౌడ్, లక్ష్మీపతి, శ్రీనివాస్, డివిజన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్