34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రజాధనాన్ని ఫలహారం గా పంచి పెట్టద్దు 

ప్రజాధనాన్ని ఫలహారం గా పంచి పెట్టద్దు 

ప్రజాధనాన్ని ఫలహారం గా పంచి పెట్టద్దు 

* రేవంత్ ప్రభుత్వానికి కేబినెట్ మంత్రులకు శుభాకాంక్షలు.

* అభివృద్ధికి సంక్షేమానికి మధ్య ప్రభుత్వం సమతూకం పాటిస్తుందని ఆశాభావం

* రాష్ట్ర అధ్యక్షులు లోక్ సత్తా పార్టీ.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

ప్రజలు నిరంతరం కష్టపడుతూ చెమటోడ్చి చెల్లించిన పన్నుల ద్వారా సమకూరిన ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం మాదిరిగా దుబారా చేయకుండా అనుయాయులకు ఫలహారంగా పంచి పెట్టకుండా అర్హులైన నిరుపేదలకు దక్కేలా సంక్షేమ పథకాలను రూపొందించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబినెట్ మంత్రులకు శుభాకాంక్షలు తెలియ జేశారు. రాష్ట్రంలో జరగవలసిన అసలైన అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి మధ్య సమతూకం పాటించి ఉత్తమ ఫలితాలు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని  ప్రభుత్వం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సత్తా పార్టీ  ప్రజా సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తుందని శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేస్తుందని ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని తుమ్మనపల్లి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి  నివేదిస్తామని ఆయన అన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి ప్రజా ఉద్యమాలను చేపడతామని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కార్యదర్శి మల్లాది కిషోర్ వంగాల రంగాచారి రోహిత్ శివ రామ కృష్ణ కారుమంచి గణేష్ సత్యనారాయణ ఫణీంద్ర సూర్య  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్