ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన: జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని
యదార్థవాది ప్రతినిది మెదక్
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు.