ప్రజావాణిలో సత్వరమే పరిష్కరం..కలెక్టర్ అనురాగ్
సిరిసిల్ల, 19 డిసెంబర్, 2022
ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సర్వారమే పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి సత్వర న్యాయం చేయాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.