25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణభారాస లోకి భారీగా చేరికలు

భారాస లోకి భారీగా చేరికలు

భారాస లోకి భారీగా చేరికలు

మెదక్ యదార్థవాది ప్రతినిది

మెదక్ జిల్లా మండల పరిధిలోని రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పార్టీలో చేరుతున్న వారుకి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పార్టి కడువ కప్పి ఆహ్వానించి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంతిగా మన కేసిఆర్ అవుతారని అన్నారు. రాజపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరి యేసయ్య, సంఘ బాధ్యులు నాగరాజు, నారాయణతో పాటు సుమారు 20 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్ ఎలక్షన్ రెడ్డి, ఉపసర్పంచ్ నవీన్, నాయకులు నారాయణ, లక్ష్మీనారాయణ, అనిల్, యాదగిరి పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్