భూనిర్వాహసిత యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలి…
హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది
భూనిర్వాహసిత యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని మాజీ పోలీస్ అధికారి దాసరి భూమయ్య అన్నారు.. అక్కన్నపేట మండలం గౌరెల్లి ప్రాజెక్ట్ గుడాటిపల్లి భూనిర్వాసిత యువత 60రోజుల నుండి దీక్ష చేస్తున్న యువతకు సంఘీభావంగా దాసరి భూమయ్య ఒకరోజు దీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరెల్లి రిజర్వాయర్ భూసేకరణ కోసం 10,15 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి, అప్పటి నుండి ఇప్పటివరకు పెండ్లిలకు వచ్చిన యువతులు ప్రభుత్వం జాప్యంతో పెండ్లిలు చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలా అని ప్రశ్నించారు.. దీనికి కారణం ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎస్సి, ఎస్టి బడుగు బలహీన వర్గాల, యువతి, యువకులకు అండగా నిలవాలని కోరారు. ధర్నా చేస్తున్న భూనిర్వాసిత యువతి యువకులను చంపుతామని బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవ తీసుకొనీ భూములు కోల్పోయిన రైతులను, వారి పిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని భూమయ్య కోరారు..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/504-6.jpg)