మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
యదార్థవాది ప్రతినిది దుబ్బాక
లింగుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్ ఢీ, పలువురికి తీవ్రగాయాలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తన కారు ని ఆపి, సహాయక చర్యలు క్షతగాత్రులని తన వాహనం తో పాటు, అంబులెన్స్ లో ఆసుపత్రి కి తరలింపు మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ సమీపంలో ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి అటుగా వెళుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వాహనం ఆపి దిగి సాయక చర్యలు చేపట్టారు.
తన సహాయక సిబ్బంది, అక్కడకు చేరిన మరికొందరి సహాయంతో గాయపడిన వ్యక్తులను వెంటనే తన వాహనంతో పాటు మరికొందరిని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యల కు ఫోన్ చేసి, క్షతగాత్రులకి తక్షణమే మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులలో ఒకరిని లింగుపల్లి గ్రామానికి చెందిన జోగ్యారి నర్సింలు గా గుర్తించారు.