30.2 C
Hyderabad
Wednesday, March 4, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌: సీఎం జగన్‌..

మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌: సీఎం జగన్‌..

మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌: సీఎం జగన్‌..

యదార్థవాది ప్రతినిది తాడేపల్లి

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని,  ఎపి సి ఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్