22.1 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణ'రీ సర్వే' చేస్తున్న అధికారులు..

‘రీ సర్వే’ చేస్తున్న అధికారులు..

‘రీ సర్వే’ చేస్తున్న సందర్భంలో అస్సలైన నిరు పేదలకు రెండు పడకల ఇండ్లు కేటాయించాలి

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇచ్చే పధకం పాలకులకు పట్టింపు లేదు, అధికారుల అలసత్వం, నిరుపేద కుటుంబాలకు రెండు పడకల ఇండ్లు దక్కలేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు.. మంగళవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గడిపె మల్లేశ్ మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం పేదలకు రెండు పడకల ఇండ్లు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని గుర్తించేందుకు సంబంధిత అధికారులు చేసిన సర్వేలో అనేక లోపాలు జరిగాయని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ధర్నా చేసిందని, మల్లి ‘రీసర్వే’ చేయాలని, మల్లి దరకాస్తు చేసుకోవడానికి పది రోజుల గడువు పొడిగించాలని మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇంచార్జీ ఆర్డీవోను ప్రజలు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.. అధికార యంత్రాంగం మల్లి ‘రీ సర్వే’ చేస్తున్న సందర్భంలో అస్సలైన ఏ భూమి లేని నిరు పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలనే కచ్చిత అభిప్రాయంతో ఆ కేటాయింపుల ఫలితాలు కోసం హుస్నాబాద్ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదిరి చూస్తున్నాయని గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, ఎండి అక్బర్, కొంగర కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్