30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణరైతుల ధర్నా

రైతుల ధర్నా

రైతుల ధర్నా

స్వరాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

ఎండకాలం రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని బుదవారం కోహెడలో రైతులు రాస్తారోకో చేశారు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామ రైతులు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని వేలాపాలలేని కరెంటు కోత వల్ల పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోయారు, స్థానిక ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ తక్షణమే కరెంటు తిప్పలు తీర్చాలని, ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల కరెంటు వాగ్దానాన్ని నెరవేర్చాలని కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద తీగలకుంటపల్లె, వివిధ గ్రామాల రైతులు రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పై అధికారులతో చర్చించి విద్యుత్ కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో తీగలకుంటపల్లి గ్రామ సర్పంచ్ మేకల చంద్రశేఖర్ రెడ్డి, కోహెడ బిజెపి నాయకులు వెంకటేశం, గుగ్గిళ్ళ శ్రీనివాస్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్