లారీ లోంచి ఆటోపై జారిపడిన గ్రానైట్ రాయి
* నలుగురు మృతి
* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
* పరిస్థితి విషమం
మహబూబ్నగర్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మంగోలి గూడెంకు చెందిన కూలీలు ఆటోలో తిరిగి వారి ఇళ్లకు వెళుతుండగా పక్కనే భారీ గ్రానైట్ రాయి లోడుతో వెళుతున్న లారీ నుంచి గ్రానైట్ రాయి జారీ ఆటో పై పడింది.అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉంది.





