వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ..
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2023 రాష్ట్ర డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర భారీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీతమ్మదారలో సోమవారం ప్రైవేటు భవన్ లో వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ విశాఖ యూనిట్ అధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడులు సదస్సును విజయవంతం చేసిన. జర్నలిస్టులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్ట్ సభ్యులు సంక్షేమానికి ఫెడరేషన్ అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారంలో తమ యూనియన్ ముందు వరుసలో ఉందని రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ కార్య వర్గ సభ్యులు నిరంతరం సభ్యుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు వైసిపి నేతలు కేకే రాజు, రవిరెడ్డి, సతీష్ వర్మ, విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి నారాయణ్, కార్యదర్శి అనురాధ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.