వ్యక్తి వికాసానికి గురువు మార్గదర్శి : మహిళ కమిషన్ ఛైర్పర్సన్
మెదక్ యదార్థవాది ప్రతినిది
వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ & చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందచేసిన సునీత లక్ష్మారెడ్డి. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలో వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్, చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యా రంగంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అందచేసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదని, తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది మాత్రమేనని అన్నారు. ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నదంటే గురువుల పాత్ర ఎంతో ముక్యం సమాజాం జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతారని, జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను… విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందు గానూ సెప్టెంబర్ 5న “ఉపాధ్యాయ దినోత్సవం”గా “గురు పూజోత్సవం”గా జరుపుకుంటున్నమని అన్నారు.