శారదా పీఠంలో నృత్య ప్రదర్శన చేసిన: బిందు
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు రోజులుగా పెందుర్తి శారదా పీఠంలో అధికారుల ప్రముకులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో శ్రీశారదాపీఠం కళకళలాడింది. శ్రీ సాయి కళానికేతన్ రాగిణి కూచిపూడి నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కూచిపూడి నాట్య మయూరి యోగీత బిందు ప్రదర్శించిన నాట్యం భక్తులతో పాటు ప్రముఖులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తించింది. తన నాట్యం చూసి భక్తులు కరతాల ధ్వనులతో యోగీత బిందువును ఆశీర్వదించారు. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వామీజీ యోగీత బిందు కు ప్రశంస పత్రాన్ని అందజేశారు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్న బిందుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కొనియాడారు ఈ నాట్యంలో నాట్య మండలి చిన్నారులు అనేకమంది పాల్గొన్నారు