శివాలయాలకు పోటెత్తిన భక్తజనం
యదార్థవాది ప్రతినిది శ్రీశైలం
మహా శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీగిరి క్షేత్రం శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, రావివలస, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్న భక్తులు..