షాహిద్ దివాస్ ను స్మరిస్తూ నివాళులు అర్పించిన: ఎస్.పి గౌస్ ఆలం
యదార్థవాది ప్రతినిది ములుగు
షాహిద్ దివాస్ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నివాళులు అర్పించిన జిల్లా నూతన ఎస్.పి గౌస్ ఆలం జనవరి 30/1948 హత్యకు గురైన మహాత్మా గాంధీ మరణానికి గుర్తుగా షాహిద్ దివాస్ ను జరుపు కుంటం. ఈ సందర్బంగా ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌష్ ఆలం మరియు అధికారులు, సిబ్బంది మౌనం పాటించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ గౌస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకునే రోజుగా ఈ రోజున పాటిస్తారని, అహింస శాంతి దినంగా పాటిస్తారని, దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారందరినీ దేశం స్మరించు కోవాల్సిన, గౌరవించు కోవాల్సిన భాద్యత మనందరి మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి బోగోని సదానందం (కమాండంట్ ), డి.ఎస్.పి సుభాష్ బాబు, ఆర్. ఐ రాధారపు స్వామి, సి. ఐ సార్ల రాజు, ఎస్. ఐ కమలాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.