సంఘ సంస్కర్త సావిత్రి బాయి పులేకు ఘన నివాళి
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
మహిళలకు విద్య కుల వివక్ష లేకుండా పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫులే 126 వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ ITI కాలేజిలో సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ..ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ జ్యోతిరావ్ పులే మన అణగారిన వర్గాల కొరకు విద్య ఎంతో అవసరం అని గుర్తించి తన బార్య సావిత్రి బాయికి చదువు నేర్పించారు..దేశంలో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికలకు ప్రత్యేకంగా తొలి పాఠశాల నెలకొల్పిన విద్యావేత్త సావిత్రి బాయి ఫులేనని గుర్తుచేసుకున్నారు..ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని అయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ టి అధ్యక్షులు మోహన్ నాయక్, జిలా యువజన అధ్యక్షులు అంకార్ గణేష్, జిల్లా నాయకులు చంద్రకాంత్ కాస్తూరి ప్రవీణ్ కారంపూరి రవి కుమార్ శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.