30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసింగోజు సేవలు అభినందనీయం

సింగోజు సేవలు అభినందనీయం

సింగోజు సేవలు అభినందనీయం

సిద్దిపేట యదార్థవాది

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్జీవోస్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ గాయత్రీ విశ్వకర్మ భగవాన్ దేవాలయ ప్రాంగణం జయశంకర్  కల్యాణ మండపంలో స్థానిక విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ 41వ వార్డు కౌన్సిలర్ సాయన్న గారి సుందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పబ్బోజు యాదగిరి చారి, పుల్లయ్య గారి శ్రీనివాస్ చారి,
మట్రోజు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలో సమయం కేటాయించి గుర్తింపు తెచ్చుకోవడమే అత్యంత కష్టంగా ఉంటుందని అటువంటిది సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు గత కొన్ని సంవత్సరాల క్రితమే సామాజిక సేవలో భాగంగా చేసిన కృషికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముని మనవల్ల చేతుల మీదుగా అంబేద్కర్ రత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారని ఇప్పటికీ వివిధ రంగాల్లో సేవలందిస్తూ ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో అసిస్టెంట్ యోగా మాస్టర్ గా, యువభారత్ జిల్లా అధ్యక్షుడిగా, కులంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడిగా, జర్నలిస్టుగా సమాజంలోని ఎన్నో రుగ్మతలను రూపుమాపడానికి తన వార్తల ద్వారా, వ్యాసాల ద్వారా సమాజానికి అవగాహన కల్పిస్తూ ఇలా పలు రకాలుగా సేవలందిస్తూ తనదైన ఒక గుర్తింపును ప్రత్యేకతను చాటుకుంటున్నాడని ఇటీవల ఢిల్లీలో జరిగిన కులవృత్తులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తన సామాజిక బాధ్యత నిరూపించుకున్నారని అన్నారు. సన్మాన గ్రహీత సింగోజు మురళీకృష్ణ మాట్లాడుతూ తనను ఘనంగా సత్కరించిన సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ బాల్యం నుండే సామాజిక బాధ్యతను కలిగి ఉన్నానని దాన్ని తుది వరకు కొనసాగిస్తానని సమాజంలో అసమానతలు కొన్ని రకాల రుగ్మతలు రూపు మాపడమే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో మేడోజు నరసింహ చారి, పెంటయ్య చారి, రంగయ్య చారి,పానుగంటి స్వామి చారి,పోలోజు మహేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్