సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు: జిల్లా కలెక్టర్
సిద్ధిపేట యదార్థవాది
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం
పత్రిక ప్రకటనలో పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటన పై ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారు విజ్ఞతతో ఆలోచించలని ఎలాంటి పుకార్లు, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏదైనా ఆందోళనలు కలిగిన, స్థానిక పోలీసులను సంప్రదించాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని జిల్లా అధికార యంత్రంగానికి, పోలీస్ శాఖ వారికి సహకరించలని, జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.