27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణస్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రభుత్వ విప్ అడ్లూరి

జగిత్యాల యదార్థవాది ప్రతినిధి

స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని  భావితరాల వారికి ఆయన పోరాట ప్రతిమలు తెలియజేయాలని ధర్మపురి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం వడ్డే ఓబన్న 217 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటి సారిగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1807 జనవరి 11 న కర్నూల్ లో జన్మించిన ఆయన పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని 10 వేల మందితో సైన్యం ఏర్పాటు చేసుకొని  బ్రిటీష్ సైన్యంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. ఒడ్డెర కులస్తులకోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని రాష్ట్రంలో నివసిస్తున్న ఒడ్డెర కులస్తుల కష్ట సుఖాలు పరిశీలించి వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వార సహకారం అందజేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 

ఒడ్డెర కుటుంబాల్లోని భార్యాభర్తలు కష్టపడి జీవితం సాగించేవారని  ఒద్దేరాలను ఎస్టి జాబితాలో చేర్పించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తిసుకువస్తానని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పేదల సంక్షేమం జిల్లా సమగ్రాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో చరిత్ర సృష్టించిన ఓబన్న చరిత్రను ప్రతీ ఒక్కరు  తెలుసుకోవాలని స్వేచ్చ సమానత్వం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు.

జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని గొప్పవారిని స్మరించుకొని స్పూర్తిగా తీసుకోవాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిసి బంధు పథకాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. 

అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ మహోన్నతులు స్వాతంత్ర్య సమరయోధులు జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని వడ్డెర ఓబన్న జయంతి వేడుకను మొట్ట మొదటి సారిగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వడ్దేరులు కష్టపడేతత్వం ఉందని వారు స్వతంత్ర జీవులని ఓర్పు ఎక్కువగా ఉంటుందని ఆనాటి ఉద్యమకారుల చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. 

ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలయ్య మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో పుటిన ఓబన్న ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని శిస్తుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన రాయి కొట్టడం ఒడ్డెర కులస్తుల జీవనోపాధి కష్టార్జితంతోనే జీవనం సాగిస్తారని అన్నారు. కార్యక్రమంలో బి.సి. సంక్షేమ అధికారి సాయిబాబా మున్సిపల్ ఇంచార్జీ చైర్మన్ గోలి శ్రీనివాస్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ బి.సి. ఒడ్డెర కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్