స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించిన : మాజీ ఎంపీ
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ ఎంపీ పొన్నం
హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు శటగోపం పెట్టిన సీఎం కేసీఆర్, దేవుళ్లకు శటగోపం పెడితే దేవుడు క్షమించడని, దేవాలయాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చేల కేసీఆర్ కు సద్భుద్దిని కలగజేయాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు.