హాఫ్ మారథాన్ గోడపత్రిక ఆవిష్కరణ
సిద్ధిపేట యదార్థవాది
సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు 6న నిర్వహించబోయే హాఫ్ మారథాన్ రన్ గోడపత్రికను సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాఫ్ మారతాన్ రన్ కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.అందరికీ ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులకు మా సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే హాఫ్ మారతాన్ డిజిటల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు,ఆసక్తి గల అభ్యర్థులు ప్రతినిత్యం వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నవారు ఈ రన్ లో పాల్గొనాలన్నారు. సిద్ధిపేట జిల్లా జర్నలిస్టులు అందరూ ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేట ఆఫ్ మారథాన్ రన్ సిద్దిపేట పట్టణ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేదిగా ఉంటుందని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి క్రీడాకారుల్లో మారథాన్ పరుగును తెలియజేయుటకు, ప్రోత్సహించేందుకు హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది గ్రామీణ క్రీడాకారులకు గొప్ప అవకాశమని https://shm23.iq301.com ఈ లింక్ ద్వారా అందరు రిజిష్టర్ చేసుకోవాలన్నారు.. కార్యక్రమంలో జర్నలిస్టులు యాదవ్ రెడ్డి, సంజీవరెడ్డి, పాండు, రామకృష్ణ, సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, జాని యూసుఫ్, నగేష్ రామేశ్వర శర్మ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు బాపురెడ్డి, రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.