27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅనంతగిరిపల్లి లో కంటి వెలుగు కార్యక్రమం

అనంతగిరిపల్లి లో కంటి వెలుగు కార్యక్రమం

159 మందికి కంటి పరీక్షలు
యదార్థవాది ప్రతినిది గజ్వేల్
అందమైన ప్రపంచాన్ని చూడటానికి కారణం కళ్లేనని అలాంటి కన్నులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ జీవి అయిన ఈ ప్రకృతిని చూడాలన్నా చూసి ఆ అందాలను ఆస్వాదించాలన్నా నేత్రాలతోనే సాధ్యం అని ఆలాంటి కళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును ప్రారంభించిందన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరు కంటి వెలుగులో పాల్గొని తమ కళ్ళను పరీక్షించుకోవాలని చెప్పారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో గడ ఆఫీసర్ ముత్యం రెడ్డి సర్పంచి అప్పిడి సునిత, ఉపసర్పంచి కనకరాజు, ఎంపీటీసి వెంకటేశ్ గౌడ్, జడ్పీటిసి బాలమల్లు యాదవ్, ఎంపీడీవో స్వర్ణకుమారి, మండల వైద్యాధికారిణి డాక్టర్ హరిత ఎంపిపి లత రమేష్ గౌడ్, పి ఎ సి ఎస్ రామకృష్ణారెడ్డి
డీ పి ఓ దేవికా దేవి, డి ఎల్ పి ఓ వేదవతి,
పి ఎ సి ఎస్ డైరెక్టర్ బుచ్చమ్మ, వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీ నరేందర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తుమ్మల నరసింహులు మరియు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్