అన్నప్రసాదం ఒకరోజు విరాళ పథకం..
తిరుపతి: 9 యదార్థవాది ప్రతినిది
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు అన్నప్రసాదాలు అందించే టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది.. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాదం కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుందాని ట్రస్టు తెలిపింది. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయంలో దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారని టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు తెలిపింది.