అన్ని రంగాల్లో జగిత్యాల శరవేగంగా అభివృద్ధి: మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల యదార్థవాది
అన్ని రంగాల్లో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుకు సాగుతుందని సంక్షేమశాక మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జనరల్ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్, తెలంగాణ రేడియాలజీ భవన్ ను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్యం మరింత చేరువలో ఉందలనే ఉద్దేశ్యం తో కంటి ఆపరేషన్ థియేటర్, ఆలాగే రేడియాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీమతి యాష్మీన్ భాష, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మంద మకరంద్, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సంబందించిన వివిధ శాఖ ఆధికారులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు..