34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅభిమానులు, కార్యకర్తలే బలం.. నా బలగం: ఎమ్మెల్యే సతీష్ బాబు..

అభిమానులు, కార్యకర్తలే బలం.. నా బలగం: ఎమ్మెల్యే సతీష్ బాబు..

అభిమానులు, కార్యకర్తలే బలం.. నా బలగం: ఎమ్మెల్యే సతీష్ బాబు..

– పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు..

-కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నా అదృష్టం..

– హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దే నా పరమావధి..

-ఎమ్మెల్యే వొడిదల సతీష్ కుమార్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

పుట్టిన రోజు సందర్భంగా వేలాదిమంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్.. హుస్నాబాద్ పట్టణంలో శనివారం కార్యకర్తలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్యలో కేక్ కట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సత్కరించారు డప్పు చప్పులతో, టపాసులు కాలుస్తూ కోలాహలంగా వేడుకలు నిర్వహించారు.. స్ధానిక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు వొడితల సతీష్ కుమార్ – షమితమ్మ.. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల నాయకులు మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు వేలాదిగా తరలివచ్చి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభిమానులు బీఅర్ఎస్ కార్యకర్తలే బలం.. నా బలగం
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంకా బాధ్యత పెరిగిందని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇంకా విస్తృతంగా ప్రజలకు సేవ చేస్తానని, నియోజకవర్గంలో విద్య, వైద్యం, సంక్షేమం, ఉపాధి కల్పనల రంగంలో వేలకోట్లతో నిధులు తెచ్చి అభివృద్ధి పరిచానని, ఇటీవల హుస్నాబాద్ ఐఓసిని కూడా ప్రారంభించుకున్నామని అభివృద్ధి విషయంలో సహకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కీర్తికిరీటంలో కలికితురాయి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశానని ఈ ప్రాజెక్టును త్వరలో సీఎం కేసీఆర్ చేతిలో మీదుగా ప్రారంభించి గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్