అష్టకాల. చిత్రాన్ని చిత్రించిన. రుస్తుం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
ప్రఖ్యాత కవి పండితుడు అష్టకాల నరసింహరామశర్మ మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరనిలోటు. అని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అన్నారు గురువారం చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పండితునిగా జీవితాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల కు జీవిత పాఠాలు నేర్పిస్తూ, పండిత లోకానికి అష్టావధానం, ప్రజలకు ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు కవిగా రచనలు గావిస్తూ మానసిక రుగ్మతలను ప్రక్షాళనగావిస్తూ ఐదువందలకు పైగా యజ్ఞాలు యాగాలు చేస్తూ చేపిస్తూ ఆధ్యాత్మికంగా ప్రజలతో మమేకం అయి తరించారు. వారురాసిన తుకా రామ స్వామి చరిత్రము, పుస్తకానికి ముఖచిత్రం నాతో గీయించి గొప్పగా సన్మానించారు. అతని సేవలు మరువలేనివి మారుపురనివి అష్టకాల నర్సింహరామశర్మ ఆత్మకు శాంతి కలగాలని వారి చిత్రాన్ని చిత్రించి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు