అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలి: డిసిపి
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
తట్రపోష గూడెం, తాళ్లపెట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డిసిపి కేకన్ సుదీర్ రాంనాథ్..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్య ఉన్న చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమని తెలిపారు.ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలని, ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, యువత, ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా యువతకు వాలీబాల్ కిట్స్ ని డిసిపి కేకన్ సుదీర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, ఎస్ఐ సాంబమూర్తి గ్రామస్తులు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
