ఆంద్రలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయాలి
యదార్థవాది ప్రతినిధి విజయవాడ
వైసీపీ పార్టీ గతఎన్నికల మేనిఫెష్టోలో ముస్లింలకు ఏపీలో ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటుచేసి వడ్డీలేని రుణాలు ముస్లిం మైనార్టీలకు అందచేస్తామని నాటి ప్రతిపక్ష నేత ..నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై .యస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు కానీ నేటివరకు రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రతినియోజకవర్గంలో ఇస్లామిక్ బ్యాంక్ లు ఏర్పాటుచేయలేదని ఆజుమన్ -ఏ -ఇస్లామియా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకమిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా మొహినుద్దీన్ ,ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ వేలగపూడి సచివాలయంలో వున్నా మైనార్టీ వెల్ఫేర్ ప్రధానసచివాలయంలో సమర్పించి.తదనంతరం ఏపీ మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీ ఏ . ఏం .డి ఇంతియాజ్ అహ్మద్ కు వినతి పత్రం సమర్ఫించి రాష్ట్రంలో వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వినతిపత్రంలో వున్నా పలు అంశాలను వివరించారు