ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డిని నియమించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రశేఖర్ రెడ్డి దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు . ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు అందించడానికి ప్రభుత్వం సలహాదారుగా నియమించింది . చంద్రశేఖర్ రెడ్డిది కడప జిల్లా .. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ .. ఆ తర్వాత అమరావతికి వచ్చారు .రెండేళ్ల పదవీ కాలంతో ప్రభుత్వ సలహాదారుగా ( ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగులు , ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది .ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులు , ప్రభుత్వం మధ్య సమన్వయ కర్తగా ప్రభుత్వం సలహాదారు పదవిలో నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిసింది. . ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో వెల్లడించారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్రెడ్డి…
RELATED ARTICLES