21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఆక్రమార్కులపై.!

ఆక్రమార్కులపై.!

ఆక్రమార్కులపై.!

కొరడా ఝాళిపించిన ఐరన్ లేడీ

కిష్ణ జిల్లా యదార్థవాది ప్రతినిధి 

అపార్టుమెంట్ లో టెర్రస్ ని ఆక్రమించి నీరు లభ్యం కాకుండా వేధింపులకు గురిచేస్తున్న వారిని ఐరన్ లేడీ ఆటకట్టించింది..

2010లో ఒక కేసు ఆ కేసుని ఉపసంహరించుకోవాలని వేధించగా 2023లో మరో కేసు నమోదు చేయించింది.

అపార్టుమెంటులో కామన్ సమస్యలపై పోరాటం ఏకంగా కేసులు వరకు వెళ్లింది 13ఏళ్లుగా సాగుతూనే ఉంది ఆమె గూర్చి  ఆమె సమస్యలు గురించి సేకరించిన సమాచారం ప్రకారం..

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన బావినేని మాధురి(56) బందరు రోడ్డులోని టైమ్ ఆసుపత్రి ఏదుట లతా రెసిడెన్సీలో నివసిస్తున్నారు..

ఆమె అపార్టుమెంటు స్థలం అపార్టుమెంటులో ప్లాట్ లో నిర్మాణం మొత్తం వీరిదే మాధురి తండ్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ బావినేని కరుణాకర్ స్వయంగా నిర్మాణం చేసినదే..

అపార్టుమెంటులో నాలుగో ఫ్లోర్ లో  కొల్లి రామకృష్ణ నివాసం ఇతర ప్లాట్ ల్లో ఇతరులు నివాసం ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్లోని అందరూ సొసైటీ కూడా రూపొందించుకున్నారు. మాధురికి ఆధీనంలో రెండు ఫ్లాట్ లున్నాయి కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి ఒకటి ఆమె నివాసం ఉంటూ మరోకటి అద్దెకిస్తుంటారు సెల్లార్ పార్కింగ్ మొదటి ఫ్లోర్ కార్లు షోరూం అద్దెకు ఇచ్చారు. ఆమెకు  వివాహం కాలేదు తల్లిదండ్రులు పరమపదించారు..

ఆమె చెల్లెలు ఆమెరికాలో ఉంటున్నారు. ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకుని లిఫ్ట్ ఆపేయటం ఆమె ప్లాట్ లకు నీటి సౌకర్యం పైపులైన్ నిలుపుదల 

పార్కింగ్ స్థలం టెర్రస్ కొల్లి రామకృష్ణ  ప్రధాన అక్రమణదారుడు పి. వీరభద్రరావు ఇతర అపార్టుమెంటులో నివాసితులు మద్ధతుతో మానసిక శారీరక వేధింపులకు గురిచేశారు..

ఒంటరిగానే పోరాటం చేసింది 2010లో ఒక కేసు పెట్టింది పాత కేసు ఉపసంహరించుకోవాలని ఆమెను మానసికంగా శారీరకంగా ఇబ్బందిలకు గురి చేశారు.. 

ఆమెను వ్యక్తిగతంగా పరోక్షంగా హింసపెట్టి చంపాలని మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు పురికొల్పాలని మూడు సంవత్సరాలుగా అన్ని రూపాలలో పెట్టని పోలీసుల కు ఫిర్యాదు చేయగా సివిల్ మేటరని పట్టించుకోవటం లేదు. అప్పటికి వేధింపులు ఆగలేదు. దీంతో మరోసారి జిల్లా ఎస్పీ జాషువాని ఇటీవల ఆమె కలిసి సవివరంగా సమస్య నేపథ్యాన్ని స్వయంగా వివరించింది. ఆమె మానసిక, శారీరక స్థితిని అర్ధం చేసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఆమె ఆస్తిని ఆక్రమించి, మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేసిన కొల్లి రామకృష్ణ పి. వీరభద్రరావులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి..

ఆమె సుధీర్ఘ పోరాటానికి మహిళా లోకం జేజేలు పలుకుతు ఉన్నత వర్గం ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య ఐకమత్యం లోపించి ఆమెను ఆమె ఆస్తి అన్యాక్రాంతం కోసం హింసకు గురి చేసి హత్యాప్రయత్నం ఆత్మహత్య ప్రయత్నాన్నికి బలవంతంగా పురికొల్పాలని భావించటం సభ్యసమాజం తీవ్రంగా ఖండించాలి..

ఈరోజుకి కూడా ఆమె వసతికి నీటి సరఫరా పునరిద్ధరించలేదు ఆమెకు సమాజం నైతికంగా మద్ధతు పలకాలి పోలీసుల రక్షణ కల్పించి చట్టప్రకారం ఆమె ఆస్తిని ఆమెకు స్వాధీనం చేయాలని పోలీసులు న్యాయవ్యవస్థ చేస్తారని ఆశించుదాం సుధీర్ఘ సంవత్సరాలుగా ఆ ఐరన్ లేడీ పోరాటాన్ని సమాజంలో పౌరులందరం స్వాగతించుదాం.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్