ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా.. నేస్తం సొసైటీ.
-మృతురాలు సోయం పోషవ్వ కుటుంబసభ్యులను పరామర్శించిన నేస్తం సొసైటీ సభ్యులు..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా,హుస్నాబాద్ మండలం, కూచన పల్లి గ్రామానికి చెందిన సోయం పోషవ్వ అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మరణించారు.ఆదివారం నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులు సోయం పోషవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. సొసైటీ అడ్వైజర్, జర్నలిస్టు మడప రాజిరెడ్డి సొసైటీ తరఫున 50 కిలోల బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి బండి వంశీ,కోశాధికారి కార్తీక్, సభ్యులు నమిలికొండ శ్రవణ్, అఖిల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు..