ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ సిబ్బందికి యోగాలో శిక్షణ నిచ్చారు.. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ఆర్.కె డయాగ్నోస్టిక్స్ వారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/02/00-8-1024x612.jpg)