30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం 24 డిసంబర్ 22.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ లకు శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి (ఐజీ) హాజరై గౌరవ వందనం స్వీకరించి ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడకతో, వ్యాయామం, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని తెలిపారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాల, రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ ఏ.ఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జాలోద్దీన్, ఆర్ఐ లు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్