26.7 C
Hyderabad
Sunday, June 1, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఉత్తేజపూరితంగా శిక్షణ తరగతులు. 

ఉత్తేజపూరితంగా శిక్షణ తరగతులు. 

ఉత్తేజపూరితంగా శిక్షణ తరగతులు. 

విశాఖపట్నం యదార్థవాది ప్రతినిది

విశాఖపట్నం నగరంలోని విశాఖ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ హాలులో సోమవారం జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. సుమారు 60మంది శిక్షణా తరగతులకు హాజరయ్యారు. తొలి రోజు మీడియా సవాళ్లు,జర్నలిస్టుల పాత్ర, మీడియాపై దాడులు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రభావం డిజెయు లక్ష్యం తదితర అంశాలపై శిక్షణ తరగతులు సాగాయి తరగతులను సీనియర్ జర్నలిస్ట్ రమేష్ (కాకతీయ యూనివర్సిటీ) హిందూ మీలాప్ ఎడిటర్ ఎఫ్ ఎం సలీం, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ సీనియర్ జర్నలిస్ట్ ఈఎన్ఎల్ఎ బాలభాను తదితరులు బోధించారు. తరగతులకు మరీదు ప్రసాదు బాబు అధ్యక్షత వహించారు. యూనియన్లో 250 మంది సభ్యులుగా చేరారు. 60 మంది శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రెండో రోజు శిక్షణ తరగతులు కూడా కొనసాగుతున్నాయి. శిక్షణ తరగతులను జాతీయ కోఆర్డినేటర్ బిఎన్ చారి పర్యవేక్షించారు. తొలుత శిక్షణా తరగతులకు రవికుమార్, సూర్యనారాయణ ఆహ్వానం పలికారు. సభహాల్, భోజనాలు ఏర్పాట్లును డిజెయు విశాఖపట్నం జిల్లా నాయకులు పర్యవేక్షించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్